22.4.13

వంటకాల పెళ్ళి

వంటకాల పెళ్ళి

పాయసం అనే ఊరిలో, 'కోవా' అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు 'బాదుషా'. అతని కుమార్తె పేరు 'గులాబ్ జామ్'. ఆ రైతుకు పులిహొర అనే పొలం ఉండేది. పనిలో సాయం చేయటానికి దద్దోజనం అనే సేవకుడుండేవాడు. ప్రయాణం చేయటానికి మినపట్టు, పెసరట్టు, అనే రెండు గుర్రాలుండేవి. వీరితో జిలేబి అనే ఇంట్లో ఆ రైతు నివసిస్తూ ఉండేవాడు....

ఒకనాడు ఆ ఊరికి వడ, ఆవడ అనే ఇద్దరు దొంగలు వచ్చారు. వారు గులాబ్ జామ్ అందాన్ని గూర్చి తెలుసుకొని,కోవా ఇంట్లో లేని సమయం చూసి, దొంగలు కారప్పూస అనే తాడుతో బంధించి తెసుకొని వెళ్ళారు.. ఈ సంగతి తెలుసుకొన్న కోవా తన సేవకుడైన దద్దోజనంతో, మినపట్టు- పెసరట్టు గుర్రాలనేసుకొని, వెతకటానికి బయలుదేరాడు....

దారిలో వారికి నూనె అను నది దాటవలసి వచ్చింది. వారు అప్పడాలు అనెడి పడవ ఎక్కి, జంతికలు అనే తెడ్లతో ఆవలి వడ్డుకు చేరారు.. వారికి ఒకచోట గులాబ్ జామ్ బంధించినట్లు తెలిసింది.. వారు వెంటనే ఆ ఊరి రాజైన పకోడీ గారికి ఫిర్యాదు చేసారు.. పకోడిగారు మంత్రి ఐన లడ్డుని, సేనాధిపతి అయిన మైసూరుపాక్ ని, పిలచి, వడ -ఆవడ లను బంధించి మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు... సేనాపతి మైసూరుపాక్ తలారి అయిన సున్నుండను పిలుచుకెళ్ళి, పూతరేకులు అనెడి కత్తులతో వారి తలలు తీయించాడు..

కోవా తన కుమార్తె అయిన గులాబ్ జామ్ ను తీసుకోని రాజైన పకోడిగారి వద్ద సెలవు తీసుకోవటానికి వెళ్ళాడు.. పకోడిగారు గులాబ్ జామ్ అందాన్ని చూసి ఆమెకు తన కుమారుడయిన కేసరిని ఇచ్చి పెళ్ళిచేయ సంకల్పించి తన ఉద్దేశాన్ని కోవాకి తెలిపాడు.. కోవా ఆనందానికి అవధులు లేవు. తన కుమార్తెను యువరాజు కేసరికి ఇవ్వటానికి అంగీకరించాడు.. రాజు వెంటనే పెండ్లికి కావలసిన ఏర్పాట్లు చేయండని బజ్జీలు అనెడి సేవకులకు ఆజ్ఞాపించాడు...

పకోడిగారు ఒక ముహుర్తాన్న చపాతి అనే పందిరి వేసి, అరిసెలు అను మండపము కట్టి, కాజాలు & చాకోడిలు అను వాయిద్యాలతో కేసరి & గులాబ్ జామ్ లకు అతి వైభవముగా పెండ్లి జరిపించారు.....

(ఈ కధ జాబిల్లి అనే పత్రికలో 1980 లో వచ్చింది.... దీనిని నేను ఇష్టపడి దాచుకున్నాను..... ఇప్పుడు మీ అందరితో ఈ హాస్య కధని పంచుకుందామని రాసాను)

No comments:

Post a Comment